Friday, March 29, 2024
- Advertisement -

బాబుకు షాకింగ్ టెన్షన్….వైకాపా దిశగా టిడిపి రాజ్యసభ సభ్యుడు?

- Advertisement -

ఫిరాయింపు రాజకీయాలు చంద్రబాబుకు సూపర్ షాక్ ఇచ్చే టైం వచ్చేసింది. కర్నూలు జిల్లాలో టిడిపి గెలుపు కోసం భారీగా పెట్టుబడి పెట్టిన ఒక పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు రీసెంట్‌గా చంద్రబాబుకు ఆఖరి హెచ్చరికలు పంపాడని తెలుస్తోంది. తన కొడుకుకు కర్నూలు ఎమ్మెల్యే సీటు ఇచ్చేది లేనిది తేల్చిచెప్పాలని చంద్రబాబుకు హుకుం జారీ చేశాడట సదరు నాయకుడు. నేను సొంతంగా అయినా నా కొడుకును గెలిపించుకోగలనని, టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోతే పార్టీని వీడడానికి కూడా వెనుకాడేది లేదని బాబుతో చెప్పాడట ఆ నాయకుడు.

కర్నూలు జిల్లా మొత్తం ఫేమస్ అయిన టీజీ వెంకటేష్ గురించి కొత్తగా చెప్పేదేముంది. కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి జంప్ చేశాడు. వెంకటేష్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని హామీ ఇచ్చాడు బాబు. అయితే రీసెంట్‌గా కర్నూలు పర్యటనలో భూమా వర్గానికి చెందిన మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని లోకేష్ చెప్పినప్పటి నుంచీ టీజీ వెంకటేష్ చంద్రబాబుకు హెచ్చరికలు పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తాజాగా చివరి హెచ్చరిక కూడా ఇచ్చేశాడట టీజీ. ఈ నెలలోపు చంద్రబాబు తేల్చకపోతే టీడీపీని వీడడం ఖాయమని చెప్పేశాడట. టీజీ వెంకటేష్ కొడుక్కి కర్నూలు టికెట్ ఇస్తే భూమా ఫ్యామిలీ మొత్తం టీడీపీని వీడే పరిస్థితి ఉంటుంది. అందుకే టీజీకి చంద్రబాబు నో చెప్పడం ఖాయం. ఈ విషయం తెలుసు కనుకనే టీజీ ఆల్రెడీ వైకాపా నేతలకు టచ్‌లోకి వెళ్ళాడట. తాను ఏ స్థాయిలో ఖర్చు చేయగలనో, తన కుమారుడికి టికెట్ ఇస్తే కర్నూలు మొత్తం తాను చూసుకుంటానని భారీ హామీలు ఇచ్చాడట వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు టీజీ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అన్న ఉత్కంఠ టిడిపి జనాల్లో కూడా నెలకొని ఉంది. ఏది ఏమైనా రాజ్యసభ సభ్యుడు అయిన టీజీ ఎన్నికల ముందుగా టీడీపీని వీడి వైకాపాలో చేరితే మాత్రం అది టీడీపీకి బిగ్గెస్ట్ మైనస్ అవ్వడం ఖాయమని విశ్లేషకులు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -