Friday, April 19, 2024
- Advertisement -

పవన్ కి చరిత్ర తెలియక మాట్లాడుతున్నాడు : లక్ష్మీపార్వతి

- Advertisement -

గూడూరు నియోజకవర్గంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి తో ప్రచారంలో పాల్గొన్న తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మి పార్వతి టీడీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో కాగ్ రిపోర్ట్ లో అవినీతిని ఏనాడూ ప్రశ్నించలేదు పవన్ కళ్యాణ్.. ఇక విజయవాడలో లింగమనేని గెస్ట్ హౌస్ లు ఇచ్చిన ఆస్తులు, చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజి గురించి చెప్పాలి.

నాయకుడు గా నిరూపించుకోలేని వ్యక్తి పవన్ కళ్యాణ్. బీజేపీ పంచన చేరి హిందూ మతం పేరుతో ప్రజల్ని రెచ్చ గొడుతున్నారు. కృష్ణ దేవరాయలు బ్రిటిష్ వారితో యుద్ధం చేశారు అని చెప్పడం హాస్యస్పదం అన్నారు.

చరిత్ర కూడా తెలియని వ్యక్తి అంటూ ఎద్దేవ చేశారు. టీడీపీ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదవడం మాత్రమే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో డాక్టరు గురుమూర్తి భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు లక్ష్మీ పార్వతి.

పవన్ కళ్యాన్ పై పేర్ని నాని సంచల వ్యాఖ్యలు!

పవన్‌‌కు కొడాలి నాని కౌంటర్…!

సోనుసూద్ పేరిట ఘరానా మోసం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -