Tuesday, April 23, 2024
- Advertisement -

పవన్‌‌కు కొడాలి నాని కౌంటర్…!

- Advertisement -

రాష్ట్రంలో పూర్తిగా అవగాహన రాహిత్యం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, స్పందించని పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంతో ఇప్పుడు మాట్లాడటం విడ్డూరం అన్నారు. టీడీపీ హయాంలో వివేకా హత్య కేసు విచారణ ప్రారంభమైంది. విచారణలో జగన్ అతని కి, సంబంధించిన వ్యక్తుల పాత్ర ఉంటే అప్పుడే కేసు నమోదు చేసేవారు. తన తండ్రి హత్య కేసు విచారణ పై వివేకా కుమార్తె ,ఢిల్లీలో సిబిఐని ప్రశ్నిస్తే, దానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి? అన్నారు.

వివేకా హత్య విచారణ కేసులో కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్, తమ ప్రభుత్వం విచారణ చేయట్లేదని మాట్లాడడం అవగాహన రాహిత్యం. వివేకా హత్య కేసులో సీబీఐ చేసే విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. రాజకీయాలను కూడా వ్యాపారంగా మార్చేసిన పవన్ కళ్యాణ్, ఎవరో రాసిచ్చిన డైలాగులు, స్క్రిప్టులు చదువుతున్నాడు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కు, వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు.

దేవుళ్ల గుళ్ళ పై అమిత ప్రేమ ఉందన్న బిజెపి, అంతర్వేది రథ దగ్ధం కేసులో సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన కేంద్రం స్పందించలేదు.రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు చేసిన కేసుల్లో అనేక మందిని అరెస్టులు చేశారు. మత విద్వేషాలు ద్వారా లబ్ధి పొందేందుకు రాష్ట్రంలో టిడిపి, బిజెపి, జనసేన లు కుట్రలు చేస్తున్నాయి. దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం దుర్మార్గం అన్నారు. కేంద్రానికి ధైర్యం ఉంటే గుళ్ళ పై జరిగిన దాడులపై సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అన్నారు.

వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ అందుకు ఒప్పుకునేనా ?

సోనుసూద్ పేరిట ఘరానా మోసం!

ఒకే రోజు 93 వేల కేసులు.. 500కు పైగా మ‌ర‌ణాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -