మంగళగిరి బరిలో మరోసారి నిలిచిన లోకేష్కు ఈసారి భంగపాటు తప్పదా?, గత ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఓటమి పాలైన లోకేష్కు ఈసారి ఓటమి తప్పదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇవాళ మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ కి వచ్చారా లేక పార్టీ అధినేత సభకు వచ్చారా అన్న చందంగా ప్రజలు తరలివచ్చారు.
ప్రజలకు మంచి చేశారు కాబట్టే తాము వచ్చామనే భావనలో వచ్చారు. వచ్చిన జనంతో ప్రత్యర్ధి గుండెల్లో పార్టీలో అప్పుడే భయం మేగాలు అలుముకున్నాయి.చిన్న పిలుపుకే ఇలా జనసందోహం అయితే పూర్తి స్థాయిలో పిలుపు ఇస్తే పరిస్థితి ఏంటో అంటు ఆసక్తికర చర్చ మొదలైంది.
మంగళగిరి పురవీధులలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంతో టీడీపీ, ముఖ్యంగా లోకేష్ గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. లావణ్య నామినేషన్ కార్యక్రమం విజయ సంకేతాలు ప్రకృతి సైతం కొంత వేడిమి తక్కువగా, మండుటెండను సైతం లెక్కచేయకుండా వచ్చిన ఆ ఆశేష జనవాహినితో మంగళగిరి సీతారామకోవేల నుంచి మంగళగిరి ఎన్నికల అధికారి కార్యలయం వరకు వచ్చిన జనమే దీనికి సాక్షం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇవాళ జరిగిన నామినేషన్ తోనే మీ ఓటమి తథ్యం అని ప్రజలకు మంచి చేసే పని చేస్తారనే నమకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రజలకు ఉందని అంతా అభిప్రాయం వ్యక్తం చేశారు.