Friday, May 3, 2024
- Advertisement -

మల్లెపూలు నలిపిన వారికే పదవా : యామినిపై మాధవిలత

- Advertisement -

అందం అభినయం ఉన్నప్పటికి కొందరు మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కాలేరు. అలాంటి తరహాలోనే తెలుగు బ్యూటీ మాధవి లత కూడా ఉన్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం పాలిటిక్స్ లో ఉంది. గత ఎలక్షన్స్ పవన్ కళ్యాణ్ పై శ్రీ రెడ్డి, కత్తి మహేష్ లాంటి వారు కౌంటర్స్ వేశారు.

అయితే వారికి తిరిగి కౌంటర్ మాత్రం మాధవిలత వేసింది. పవన్ తిట్టే అర్హత మీకు లేదని వారిపై రెచ్చిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేసే అవకశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొన్నటి వరకు టీడీపీలో కొనసాగిన సాధినేని యామిని ఇప్పుడు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెకి పార్టీలో కీలక పదవి ఇస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో మాధవి లత అగతంలో యమినేని సంతృప్తి వ్యక్తం చేస్తూ.. పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోకుండా నిన్న మొన్న పార్టీలో చేరేవారికి పదవులు కట్టబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె కామెంట్ చేశారు.

గతంలో యమినేని పవన్ కళ్యాణ్ మల్లెపూలు నలపడానికి మాత్రమే పనికొస్తారని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో మాధవిలత యామినేనిని ఉద్దేశిస్తూ.. మల్లెపూల వాసనలు గురించి ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పే వారికి, మల్లెపూలు నలిపిన కథలు బాగా తెలిసిన వారికి పదవులు ఇస్తారా.. అంటూ మాధవి లత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడూ ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -