తెలుగు దేశం పార్టీలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు కీలక నేతగా వ్యవహరించిన సినీ నటుడు మోహన్బాబు మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డికి ఆప్త మిత్రుడిగా పేరుబడ్డ మోహన్బాబు ఆయన కొడుకు వైఎస్ జగన్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగాకనిపిస్తున్నాయి.
తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన మోహన్బాబు తన మనసులో మాట బయటపెట్టారురు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వైకాపా తరపున పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నాను అంటూ వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుండి మోహన్బాబు సీటు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు కావాల్సిన వ్యక్తే, అటు వైసీపీ అధినేత జగన్కు బంధువే. రెండు పార్టీల నుంచి ఆయనకు ఆఫర్లు ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో చంద్రబాబుతో ఆయనకు పెద్ద సఖ్యత లేదు.
శ్రీకాళహస్తి లేదా వెంకటగిరి నియోజక వర్గాల్లో మోహన్బాబుకు మంచి పట్టు ఉంది. ఆ కారణంగానే మోహన్బాబు ఏదోకనియోజవర్గంనుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. జగన్ వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం ఖాయం అని, 2019 ఎన్నికల్లో జగన్ జెండా రెపరెపలాడటం ఖాయం అనే నమ్మకంతో మోహన్బాబు ఉన్నాడు.
మోహన్బాబు ఎంట్రీ వల్ల ఖచ్చితంగా వైకాపాకు బలం చేకూరినట్లవుతుందనడంలో సందేహంలేదు. మోహన్బాబు కోరినట్లుగా జగన్ సీట్లు కేటాయించే అవకాశం ఉందని, భవిష్యత్తులు వైకాపాలో మోహన్బాబు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.