తనకు టికెట్ రాకపోవడంలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తనకు టికెట్టు రాకుండా ఉత్తమ్ కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేల పేరుతో తాను గెలవలేనని చెప్పి, తనకు టికెట్ దక్కకుండా అధిష్ఠానాన్ని, స్క్రీనింగ్ కమిటీని ఉత్తమ్ తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు.
సనత్ నగర్ టికెట్ తనకు వస్తుందని టీడీపీ ముఖ్యనేతలు కూడా తనతో చెప్పారని అన్నారు. ఎల్బీనగర్ స్థానం కోసం పట్టుబట్టిన తమ పార్టీ నేతలు… సనత్ నగర్ ను కావాలనే టీడీపీకి అప్పగించారని మండిపడ్డారు. తనకు టిక్కెట్ దక్కపోవడంపై ఢిల్లీలోని రాహుల్ గాంధీ కార్యాలయానికి కూడా ఫోన్ చేసినట్లు తెలిపారు. పార్టీ పునరాలోచించాలని సూచించినట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం లోగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మార్చుకోకపోతే తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని ఆయన అధిష్టానానికి డెడ్లైన్ పెట్టారు.