ఎంత పెద్ద హోదాలో ఉన్నా తమ చిన్న నాటి జ్ఞాపకాలు ఎవరినైనా చిన్న పిల్లల్లా మారుస్తాయి. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ తాజాగా ఓ అపురూపమైన జ్ఞాపకాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉండే మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే.
1984లో నాలుగో తరగతి సందర్భంగా ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులతో కలిసి దిగిన ఫొటోను స్నేహితుడు పంపగా దాన్ని అభిమానులతో పంచుకున్నారు. 1984 నాటి ఫొటో. భరత్ అనే నా క్లాస్మేట్ ఈ ఫొటోను నిన్న నాకు పంపాడు. కరీంనగర్లోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ నాలుగో తరగతి చదువుతున్నప్పటి ఫొటో ఇది.
ఈ ఫొటోలోని ఉన్న అందరి పేర్లు మళ్లీ గుర్తు చేసుకున్నా. మీకు ఆశ్చర్యమనిపించినా ఇది నిజం’’అంటూ కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. తాజాగా ఈ ఫోటో సోషల్ మాద్యమాల్లో తెగ హల్ చల్ చేస్తుంది.