Friday, May 3, 2024
- Advertisement -

భట్టి కి షాక్ ఇచ్చిన పువ్వాడ..!

- Advertisement -

సాధారణంగా అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు సర్వసాధారణం. ఆ సమయంలో మైక్ గురించి ఇరు పక్షాల మద్య పోటా పోటీ ఉంటుంది. ప్రతిపక్షం మాట్లాడుతుంటే స్పీకర్ మైక్ కట్ చేయడం మనం చాలా అసెంబ్లీ సమావేశాల్లో చూసున్నాం. అదే సమయంలో అధికార పక్ష నేతలు మాట్లాడుతూంటే.. మద్యలో తమకు మైక్ ఇవ్వాలని గగ్గోలు పెట్టే ప్రతిపక్ష నేతలను చూస్తుంటాం. అయితే ఈ స్టోరీ అంతా ఎందుకంటే ఇలాంటి మైక్ గోలనే మధిరలో నూతనంగా ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మధిరలో నూతరంగా కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు హాజరయ్యారు. ప్రారంభోత్సవ సభలో మంత్రి పువ్వాడ అజయ్, సీఎల్పీ నేత, స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మధిర సివిల్ ఆస్పత్రిలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించాలని మంత్రి అజయ్ దృష్టికి తీసుకెళ్లారు. దానికి స్పందించిన పువ్వాడ గత ప్రభుత్వాలు వారసత్వాలుగా అనేక సమస్యలను ఇచ్చాయని విమర్శలు చేశారు.

ఆ తర్వాత పువ్వాడ మాట్లాడుతూ.. ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్నో చర్యలు తీసుకుంటుందని.. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కరోనా కేసులు అనూహ్యంగా తగ్గుతున్నాయని అన్నారు. ఆ సమయంలో భట్టి నేను మాట్లాడతాను.. మైక్ ఇవ్వాలని మంత్రిని కోరారు.. దానికి సమాధానంగా భట్టి గారూ.. మీరు మాట్లాడటం అయిపోయిన తర్వాతే నేను మాట్లాడుతున్నాను.. మళ్లీ మైక్ ఇవ్వటం సాధ్యం కాదు. ఇది అసెంబ్లీ కాదు అంటూ షాక్ ఇచ్చారు. దాంతో సభకు వచ్చిన వారు నవ్వుకున్నారు.

తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగింపు

నాగార్జున, కోదండరామిరెడ్డి కాంబో సక్సెస్ ఫుల్ సినిమాలు?

స్నేహితుడి కోసం పెద్ద మనసు చేసుకున్న సోనూసూద్.. నెల్లూరులో ఆక్సిజన్ ప్లాంట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -