Friday, May 3, 2024
- Advertisement -

కరోనాని కూడా రాజకీయం చేస్తున్న తండ్రీ కొడుకులు : విజయ్ సాయిరెడ్డి

- Advertisement -

ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. అటు పాజిటివ కేసులతో పాటు..మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో 14 వేల 792 మందికి కరోనా సోకింది. 57 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 1,14,158 యాక్టివ్ కేసులుండగా..7 వేల 928 మంది చనిపోయారు. అయితే ఏపిలో కరోనా పెరిగిపోవడానికి ప్రభుత్వమే కారణం అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

ముఖ్యంగా కరోనా వైరస్ పరిస్థితుల పై తెలుగు దేశం పార్టీ అదినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ లు ఇద్దరూ కూడా తరచూ విమర్శలు చేస్తున్నారు. జగన్ పాలనా విధానం పై వరుస విమర్శలు చేస్తున్నారు. తాజాగా దీనిపై స్పదించిన వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు గా జవాబు ఇచ్చారు.

టీవీల్లో కనిపించే సామూహిక శవ దహనాలు, ఆక్సిజన్ లేక సొమ్మసిల్లిన రోగుల దృశ్యాలు మన రాష్ట్రంలోనివి కావని ఆ తండ్రీకొడుకులు బాగా తెలుసు. ఇంకో రాష్ట్రాన్ని వేలెత్తి చూపే ధైర్యం లేక ప్రతిదీ జగన్ గారి ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించి ఉన్మాదుల్లా ఆనందిస్తున్నారని అన్నారు. ఇదిలా ఉంటే.. ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి మద్దతు ఇస్తూ టీడీపీ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

ప్రభాస్ గురించి షాకింగ్ సీక్రెట్స్ రీవీల్ చేసిన బాహుబలి నటుడు!

ప్రజలకు వరుణ్ తేజ్ సలహాలు.. వైరల్ పోస్ట్!

లిప్ లాక్ తో హీరోయిన్ సదా రచ్చ రచ్చ.. వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -