Monday, May 6, 2024
- Advertisement -

ప్రజలకు వరుణ్ తేజ్ సలహాలు.. వైరల్ పోస్ట్!

- Advertisement -

ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మహమ్మారి దాటికి ప్రతి రోజు వేల సంఖ్యలో మరణిస్తున్నారు. మన దేశంలో నెలకొన్న ఈ భయంకరమైన పరిస్థితులను చూసి ఇతర దేశాలు సైతం మన దేశంపై ఆంక్షలు విధించారు. అయితే ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయట పడటానికి మన ముందున్న ఒకే ఒక మార్గం వ్యాక్సిన్.

వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా కొనసాగిస్తే కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. అయితే వ్యాక్సిన్ పట్ల కొందరికి ఎన్నో అపోహలు ఉన్నాయి.ఈ అపోహలను తొలగించడం కోసం అధికారులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు ఈ క్రమంలోనే మన సెలబ్రిటీలు సైతం వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు.

Also read:టాలీవుడ్ 100 కోట్ల సినిమా.. అక్కడ మాత్రం అట్టర్ ప్లాప్!

ఈ క్రమంలోనే మెగా హీరో వరుణ్ తేజ్ వ్యాక్సిన్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. “ఎక్కువగా ఆలోచించకుండా… అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి”. అని చెప్పారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా http://cowin.gov.in లో రిజిష్టర్ చేసుకోవాలని వరుణ్ తేజ్ ప్రజలకు సూచించారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:ఆ హీరోయిన్ నిర్ణయం కారణంగా ప్యాకప్ చెప్పిన నాని..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -