అధికార పార్టీపై ప్రజల్లో అసంతృప్తి ఉందో కొన్ని సంఘటనలు చూస్తుంటే తెలుస్తున్నాయి. ప్రజలు ప్రభుత్వంపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో మంత్రి అమర్నాథరెడ్డికి తెలిసొచ్చింది. మంత్రి అమర్నాథరెడ్డికి చిత్తూరు జిల్లాలో ఓ అవ్వ చుక్కలు చూపించింది. తమ కష్టాలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో ఉన్న ఆమెకు మంత్రి కనిపించడంతో ఎక్కడ లేని ఆగ్రహం వచ్చేసింది. ఇక ఊరుకునేది లేదని భావించి మంత్రి చేతి పట్టుకొని వెంట తోలుకుంటూ వచ్చి తన గుడిసె వద్దకు లాక్కెళ్లిపోయింది.
తమ కష్టాలు తీరడం లేదని ఎన్నో ఏళ్లుగా తన సమస్యలను అధికారులకు చెప్పుకుంటున్నా ఫలితం లేకపోవడంతో మంత్రిని లాక్కెళ్లి తన గుడిసెను చూపించింది. ఆయనకు తన కష్టాలు చెప్పుకుంది. ముందు మా గుడిసె చూద్దువు కానీ రా అంటూ చేయి పట్టుకుని తన ఇంటికి లాక్కుపోయింది. మా ముసలోడికి పింఛన్ రావడం లేదని వాపోయింది. చలికి వానకు గుడిసెలో ఉండలేకపోతున్నాం రేకుల ఇళ్లయినా ఇప్పించు అని కోరింది. ఈ ఘటనకు మంత్రి అవాక్కయ్యాడు. వెంటనే అధికారులను పిలిచి మంత్రి వారికి పింఛన్, పక్కాఇల్లు మంజూరు చేయాలని ఆదేశించాడు. ఈఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం చామనేరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.