- Advertisement -
ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తూర్పుగోదావరిలో పర్యటిస్తున్న పవన్ పెద్దాపురంలో ఏర్పాటు చేసిన సభలో టీడీపీ అవినీతిని ఎండగట్టారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడు అవసరమని నాడు చంద్రబాబుకు మద్దతిచ్చానన్నారు. అయితే పాలనలో అభివృద్ధి కంటే అవినీతిపై అనుభవం పెంచుకున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
తాను ఎన్టీఆర్ అంత మంచోడిని కాదన…వెన్నుపోటు పొడిస్తే రోడు మీద చొక్కా పట్టుకొని నిలదీస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబునాయుడు హామీలిస్తారని… అధికారంలోకి రాగానే హమీలను విస్మరిస్తారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.పేకాట క్లబ్బులు నడిపే వారికి ఎమ్మెల్యే పదవులు ఎందుకని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.