Monday, April 29, 2024
- Advertisement -

కీలక నిర్ణయం తీసుకున్న పవన్…..పార్టీలో ఆసక్తికర చర్చ

- Advertisement -

జనసేన అధినేత పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆనిర్ణయంతో పార్టీ శ్రేణులు, నాయకులు అయోమయంలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు సాధించిన జనసేనను…వచ్చే ఎన్నికల నాటికి బలమైన రాజకీయశక్తిగా అవతరిస్తుందని ఆ పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కొన్ని పార్టీలు జనసేనను విలీనం చేయమని అడిగాయని తాను మాత్రం అలాంటి ఆలోచన తనకు లేదని అభిమానులకు, కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చారు.

ఇదలా ఉంటె గతంలో రెండు చోట్ల పోటీ చేసి పరాజయం చెందారు పవన్. అయితే ఈ సారి ఆయన పోటీ చేసిన గాజువాక నియోజకవర్గం విషయంలో మాత్రం జనసేన అధినేత ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

భీమవరంలో 7 వేలపైచిలుకు ఓట్ల తేడాతో పవన్ ఓటమి పాలుకాగా… గాజువాకలో 16 వేలపైచిలుకు ఓట్ల తేడాతో పరాజయాన్ని చవిచూశారు. అయితే ఇటీవల భీమవరం నియోజకవర్గంలో పర్యటించిన పవన్… మరోసారి తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. మరో వైపు గాజువాక నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి మరోసారి భీమవరం నుంచి బరిలోకి దిగుతానని స్పష్టత ఇచ్చిన పవన్… గాజువాక విషయంలోనూ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -