- Advertisement -
ఎన్నికల్లో ఘోరంగా ఓడిన జనసేన పార్టీకి జవసత్వాలు నింపేందుకు అధ్యక్షుడు పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కొత్త టీమ్ను ప్రకటించారు. పనిలో పనిగా నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించారు. 2024 ఎన్నికల కోసం పార్టీని పటిష్టం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. జనసేన పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీలను నియమించింది. నలుగురు సభ్యులతో జనసేన పొలిట్ బ్యూరో, 12 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. క్రమశిక్షణ సంఘం చైర్మన్గా మాదాసు గంగాధరాన్ని నియమించారు.
జనసేన పొలీట్ బ్యూరో
- నాదెండ్ల మనోహర్
- పి. రామ్మోహన్ రావు
- రాజు రవితేజ్
- అర్హంఖాన్
జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్: నాదెండ్ల మనోహర్
సభ్యులు
- తోట చంద్రశేఖర్
- రాపాక వరప్రసాద్ (శాసనసభ్యులు)
- కొణిదెల నాగబాబు
- కందుల దుర్గేష్
- కోన తాతారావు
- ముత్తా శశిధర్
- పాలవలస యశస్విని
- డా.పసుపులేటి హరిప్రసాద్
- మనుక్రాంత్ రెడ్డి
- ఎ.భరత్ భూషణ్
- బి.నాయకర్
క్రమశిక్షణ సంఘం చైర్మన్: మాదాసు గంగాధరంను పవన్ నియమించారు.