Sunday, May 5, 2024
- Advertisement -

భాజాపా, లోకేష్ అవినీతిపై జ‌న‌సేనుడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

- Advertisement -

2014 ఎన్నిక‌ల్లో భాజాపా,టీడీపీకి ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో ఏపీలో టీడీపీ-భాజాపాక‌ల‌సి అధికారాన్ని చేప‌ట్టాయి. బాబుకు ఉన్న అనుభంతో ఏపీ అభివృద్ది చెందుతుంద‌ని భావించిన ప‌వ‌న్ ఇన్నాల్లు ప్ర‌భుత్వాన్ని ప‌ల్లెత్తుమాట‌కూడా అన‌లేదు. కాని ప్ర‌భుత్వంలో అవినీతి, అక్ర‌మాలు పెరిగిపోవ‌డంతో జ‌న‌సేనుడు న్యూట‌ర్న్ తీసుకున్నాడు. గుంటూరులో నిర్వ‌హించిన ప్లీన‌రీలో ప‌వ‌న్ బాబు,లోకేష్ అవినీతి, భాజాపాల‌పై నిప్పులు చెరిగారు.

తాజాగా జీతీయ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వూలో ప‌వ‌న్ కేంద్రం, లోకేష్‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీతో కలసి పని చేసే అవకాశమే లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఏపీలో భాజాపా ప‌ని అయిపోయింద‌న్నారు. ఏపీకి ఎన్నో హామీలు ఇచ్చిన బీజేపీ… ఏ ఒక్కదాన్నీ నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు.ఏపీ ప్రజల విశ్వాసాన్ని బీజేపీ పూర్తిగా కోల్పోయిందని… ఏపీలో బీజేపీ ఇమేజ్ పూర్తిగా నెగెటివ్ గా ఉందని చెప్పారు. బీజేతో పొత్తు పెట్టుకోవాలని ఎవరూ భావించడం లేదని అన్నారు.

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ చేసిన అవినీతి గురించి మాట్లాడారు. లోకేష్ అవినీతి బహిరంగంగా కనిపిస్తోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును… ప్రైవేట్ కాంట్రాక్టర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిందని అన్నారు. 2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తార‌నేది కీల‌కంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -