Friday, March 29, 2024
- Advertisement -

రైతుల కష్టాలు కన్నీరు పెట్టిస్తుంది : పవన్ కళ్యాన్

- Advertisement -

నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాన్ నివర్ తుపాను బాధిత రైతులను పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కృష్ణా జిల్లాలో పర్యటించిన జనసేనాని నేటి ఉదయం 9 గంటలకు తిరుపతిలో బయలుదేరి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడి పోయ గ్రామంలో నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.

ఇప్పటి వరకు ఆయన పలువురు రైతులను కలిసి వారికి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. ప్రభుత్వం నిరవ్ తుఫాన్ బాధితుల విషయంలో వెంటనే సత్వర న్యాయం చేయాలని అన్నారు. ఇక్కడ పర్యటన తర్వాత నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్తారు. 11 గంటలకు నాయుడుపేట చేరుకుంటారు.

అక్కడ రైతులను కలుసుకుని పంట నష్టం వివరాలను తెలుసుకుంటారు. 12 గంటలకు గూడూరు చేరుకుంటారు. అక్కడి రైతులతో మాట్లాడిన అనంతరం మనుబోలు, వెంకటాచలం మీదుగా నెల్లూరు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాన్ మాట్లాడుతూ.. రైతుల కష్టాలు ప్రత్యక్షంగా చూస్తున్న తనకు కన్నీరు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -