- Advertisement -
నామినేషన్ల చివరి రోజైన సోమవారం కోడంగల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నామినేషన్ వేయబోతున్న రేవంత్ రెడ్డికి పోలీసులు మరో సారి భారీ షాక్ ఇచ్చారు. కోడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి నామినేషన్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దమయ్యారు.
రేవంత్ నామినేషన్ ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు.. కొడంగల్ లో 144 సెక్షన్ విధించారు. శాంతిభద్రతల పరిరక్షణకు భారీగా పోలీసులను మోహరించారు. అయితే అధికారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నామినేషన్ ర్యాలీ తీసితీరుతామని రేవంత్ రెడ్డి వర్గీయులు స్పష్టం చేశారు.