Monday, May 6, 2024
- Advertisement -

బాబు రాజ‌కీయానికి బొక్క‌బోర్లా ప‌డ్డ వ‌ర్లా …

- Advertisement -

టీడీపీ పార్టీనుంచ రాజ్య‌స‌భ స‌భ్యులు ఎవ‌ర‌నేది ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. సిఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ల పేర్ల‌ను ఖ‌రారు చేశారు చంద్ర‌బాబు. కాని రాజ్య‌స‌భ‌పై ఆశ‌లు పెట్ట‌కున్న సీనియ‌ర్ నాయ‌కుడికి చెవిలో బాబు పూలు పెట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌ను తిట్టిన వాల్ల‌నే అంద‌లం ఎక్కించారు బాబు. ఇప్పుడు కూడా ఆదే ఆశ‌తో ఓరేంజ్‌లో జ‌గ‌న్‌ను దుమ్మెత్తి పోశారు స‌ద‌రు నాయ‌కుడు. చివ‌ర‌కు నిరాశె మిగిలింది.

ఇదెంత ఎందుకు అనుకుంటున్నారా…వ‌స్తున్నా అక్క‌డికే..టిడిపిలో భర్తీ అవ్వాల్సిన రెండు రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సిఎం రమేష్ పేరు ఖాయమైపోయింది. ఇక రెండో పేరుకోసం వివిధ సామాజిక వ‌ర్గాల‌ను దృష్టిలో పెట్టుకొని నేత‌ల పేర్ల‌ను ప‌రిశీలించారు.

ప్రధానంగా వినిపించిన పేరు ఎస్సీ నేత వర్ల రామయ్యది. మీడియాలో ఏ స్ధాయిలో వర్ల పేరు ప్రచారం జరిగిందంటే సిఎం రమేష్ తో పాటు వర్ల పేరును చంద్రబాబు ఖరారు చేశారని చెప్పేసింది. దాంతో పార్టీ నేతల నుండి వర్లకు ఒకటే అభినందనల ఫోన్లు. ఇంకేముంది కుటుంబసభ్యులతో వర్ల కారులో చంద్రబాబు నివాసానికి బయలుదేరారు.

మధ్యలో ఓ ఛానల్ రిపోర్టర్ వర్ల కారును నిలిపి ఇంటర్వ్యూ చేశారు. మైక్ చూడగానే వర్లలో ఎక్కడ లేని ఆవేశం వచ్చేసింది. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. పనిలో పనిగా జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ అవినీతిని, వైసిపిలో సామాజికవర్గ న్యాయం తదితరాలపై జగన్ ను ఓ రేంజిలో తిట్టారు. వెంట‌నే ఛానళ్ళల్లో బ్రేకింగ్ అంటూ మరో న్యూస్. సిఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్లకు చంద్రబాబు రాజ్యసభకు ఎంపిక చేశారంటు. దాంతో వ‌ర్ల ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. చేసేదిలేక కుటుంబ సభ్యులతో అదే కారులో వెనక్కుతిరిగి వెళ్ళిపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -