Saturday, April 20, 2024
- Advertisement -

రేవంత్​ సింహం.. ఇక పులులన్నీ పరారే..! ఆర్జీవీ ట్వీట్

- Advertisement -

ఎప్పుడు ఎవరో ఒకరి మీద పడి వివాదాస్పద కామెంట్స్ చేసే రామ్ గోపాల్ వర్మ ఈసారి రాజకీయాలపై పడ్డాడు. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక అవడంపై వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ‘కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాజీవ్​ గాంధీ ఓ గొప్ప పని చేశారు. అది ఏమిటంటే సింహం లాంటి వ్యక్తి రేవంత్​రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడమే. ఇక పులులన్నీ పరార్​ కావాల్సిందే’ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాక.. తొలిసారిగా కాంగ్రెస్​ పార్టీ అంటే ఇంట్రెస్ట్​ కలుగుతోందంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్​ వైరల్​ గా మారింది.

రేవంత్​ని పీసీసీ అధ్యక్షడిగా నియమించడం పట్ల పలువురు ఆయనను ప్రశంసిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్​ పార్టీలో అప్పుడే అంతర్గత లుకలుకలు కూడా మొదలయ్యాయి. కొందరు సీనియర్లు మౌనం వహించారు. కొందరు రాజీనామా ప్రకటిస్తున్నారు. దూకుడుకు వెళ్లే స్వభావం ఉన్న రేవంత్​రెడ్డి .. కాంగ్రెస్​పార్టీలోని సీనియర్​ నేతలను ఎలా కలుపుకొని వెళ్తారో వేచి చూడాలి.

కాగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తో పాటు, కార్యనిర్వాహక అధ్యక్షులను కూడా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా, మహమ్మద్ అజారుద్దీన్, గీతారెడ్డి,అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి,మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమితులయ్యారు.

Also Read

ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ అర్జీవి లాజిక్స్..?

కాంగ్రెస్​ను అధికారంలోకి తెస్తా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -