Wednesday, May 15, 2024
- Advertisement -

టీడీపీకీ మ‌రో సిట్టింగ్ ఎమ్మెల్యే గుడ్ బాయ్‌ …..

- Advertisement -

తెలుగుదేశం పార్టీకి మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌నుంది. ఇప్ప‌టికే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు , ఓ పార్ల‌మెంట్ స‌భ్యుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరిపోయారు. త్వ‌ర‌లోనే ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది జ‌ర‌గితే బాబుకు అతి పెద్ద బిగ్ షాక్ అవుతుంది.

మ‌రో సారి అధికారంలోకి రావాల‌ని బాబు ఎడాపెడా వారాలు కురిపిస్తున్నారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల‌య్యే లోగా ఈ ప్ర‌క‌టిస్తున్న ప‌థ‌కాల‌న్ని ప్ర‌జ‌ల‌కు చేరాలా బాబు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుంటే…నేత‌లు మాత్రం పార్టీని వీడుతుండ‌టంతో బాబు అయోమ‌యంలో ఉన్నారు. తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లాలో మ‌రో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బాబుకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారంట‌. ఇప్ప‌టికే ఆఎమ్మెల్యే వైసీపీనేత‌ల‌తో మాట్లాడిన‌ట్లు స‌మాచారం.

పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఒక‌ర‌యిన … కాపు సామాజికి వ‌ర్గానికి చెందిన రామ‌చంద్రాపురం ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులు పీర్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఎమ్మెల్యే కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూట్లో ఉన్నారని సమాచారం. త్వ‌ర‌లోనే జ‌గ‌న్‌ను క‌ల‌సి ఆయ‌న స‌మ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే తూర్పుగోదావ‌రి జిల్లాలో టీడీపీ చేతులెత్తేయాల్సిందేనా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -