కాంట్రవర్సీలకు కేరాఫ్ గా ఉండే దర్శకుడు రామ్గోపాల్ వర్మ మరోసారి వరుస ట్వీట్స్తోటి ట్రెండింగ్లోకి వచ్చారు. భీమ్లా నాయక్పై ట్వీట్లపై ట్వీట్లు చేస్తూ పవన్ అభిమానులను కవ్విస్తూ వచ్చిన ఆర్జీవీ రీసెంట్ గా ఆ సినిమా తనకు నచ్చిందనీ..సినిమా అంతా ఉరుములు, మెరుపులు అంటూ పవర్ స్టార్ను పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసింది.
తాజాగా మరోసారి తన ట్వీట్స్లో పవన్ కల్యాణ్ గురించి రామ్గోపాల్ వర్మ ప్రస్తావించారు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ మాట్లాడిన వీడియోను అందులో పంచుకున్నారు. హే.. పవన్ సర్! కాబోయే పీఎం కేఏపాల్ చెబుతున్నారు విను” అంటూ తన ట్వీట్కు క్యాప్షన్ని రామ్గోపాల్ వర్మ జత చేశారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంతి కావాలన్నా, మంత్రి అవ్వాలన్నా.. పవర్ స్టార్ అభిమానులకు ఒక్క పర్సంట్ నీతి, నిజాయితీ ఉన్నా ఆయన్ను మా ప్రజాశాంతి పార్టీలో చేరమని చెప్పండంటూ ఆ వీడియోలో కేఏ పాల్ ప్రసంగించారు.
42 మంది ఎంపీలను గెలిపించుకుని, మీరు ‘ఎస్’ అంటే నేనే ప్రధాన మంత్రిగా ఉంటాను. కావాలంటే పవన్ కల్యాణ్ను ఆంధ్రప్రదేశ్కు సీఎంని చేద్దాం. తప్పేముంది ?” అంటూ పాల్ ఆవేశంగా ప్రసంగం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
బాలీవుడ్ బ్యూటీతో లవ్లో సందీప్ కిషన్.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా ?