ప్రభాస్ను పాన్ ఇండియా స్టార్ గా మార్చిన బాహుబలి నుంచి మరో భాగం తెరకెక్కనుందా ? బాహుబలి 3 రాబోతోందా ? డార్లింగ్ ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు తాజాగా ఆసక్తికరంగా మారాయి. ప్రభాస్..అప్కమింగ్ సినిమా రాధేశ్యామ్ మార్చ్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ప్రభాస్..ఇప్పుడు పూజాహెగ్డేతో కలిసి రాధేశ్యామ్ పూర్తి చేశాడు.
ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్ పనిలో పూజాతో కలిసి బిజీగా తిరుగుతున్నాడు. ఈ సందర్భంగా బాహబలి మూడవ భాగం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అప్పుడే బాహుబలి విడుదలై నాలుగేళ్లు పూర్తవుతోంది. ఈ సినిమా మూడవ భాగం వస్తుందా లేదా అనే సందేహం ప్రతిఒక్కరిలో ఉంది. రాజమౌళితో ఎప్పుడూ తాను సినిమాల గురించి చర్చించనని ప్రభాస్ చెప్పాడు. రోజూ మాట్లాడుకున్నా సినిమా ఎప్పుడు తీసేది అడగనన్నాడు.
బాహుబలి సమయంలో కూడా ఎప్పుడూ ఎవరి సినిమాల గురించి చర్చించలేదన్నాడు. అదే సమయంలో బాహుబలి 3 తీసే ఉద్దేశ్యం రాజమౌళితో పాటు నిర్మాత యార్లగడ్డ శోభుకు ఉందన్నాడు. బాహుబలి సినిమా ఆ ఇద్దరినీ వదిలే ప్రసక్తే లేదన్నాడు.
మహేశ్కు విలన్గా విక్రమ్… మ్యాజిక్ చేయబోతున్న త్రివిక్రమ్