టీఆర్ఎస్ పార్టీకీ రెబల్స్ అభ్యర్తుల బెడద తప్పడంలేదు. టికెట్ దక్కని వారు పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు ఎగరేస్తున్నారు. తాజాగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు టికెట్టు రాకుండా మంత్రి జగదీశ్వర్ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు. అంతేకాదు ఒక అమరవీరుని తల్లినని చూడకుండా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్ఎస్ నుంచి హుజూర్ నగర్ టికెట్ తనకు టికెట్ రాకుండా జగదీశ్ రెడ్డి అడ్డుకుంటున్నారని, నాలుగేళ్లుగా తనను వేధిస్తున్నారని ఆయనపై ఆరోపణలు చేశారు. ఎన్ఆర్ఐ సైదిరెడ్డికి టికెట్ ఇప్పించేందుకు జగదీశ్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారని, ఆయనకు టికెటిస్తే తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట పెట్రోల్ పోసుకని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
కేసీఆర్ తనకే టికెట్ ఇస్తారని నమ్ముతున్నానని చెప్పారు. ప్రాణం పోయినా పార్టీని వీడని వెల్లడించారు. తనకు టికెట్ ఇవ్వకపోతే అమరవీరులకు అవమానమని తెలిపారు. జగదీశ్ రెడ్డికి అమరవీరుల ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. తన చావుకు మంత్రి జగదీష్రెడ్డిదే బాధ్యత అని శంకరమ్మ ప్రకటించారు.