Saturday, May 18, 2024
- Advertisement -

శిల్ప‌సోద‌రుల భేటీ…? మ‌ద్ద‌తు త‌మ్ముడికా…..టీడీపీకా…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక నామినేష‌న్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టం…మ‌రో వైపు వైసీపీ అధినేత జ‌గ‌న్ భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేస్తున్న నేప‌థ్యంలో ఉప ఎన్నిక మ‌రింత రంజుగా మారుతోంది.ఇప్ప‌టివ‌ర‌కు శిల్పామోహ‌న్ రెడ్డి..త‌మ్ముడి చ‌క్ర‌పానిని క‌ల‌వ‌లేదు.కాని ఇప్పుడు వీరిద్ద‌రు భేటీ కావ‌డం నంద్యాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

శిల్పా సోదరులు ఇటీవలి వరకు ఒకే పార్టీలో ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరి, టిక్కెట్ దక్కించుకున్నారు. నంద్యాల నుంచి భూమా కుటుంబం నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదమ్ముల పోటీ లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

శిల్పా చక్రపాణి టిడిపిలోనే కొనసాగుతున్నప్పటికీ ఆయన ఎవరికి మద్దతు పలుకుతారనే చర్చ అంతటా సాగుతోంది. వైసిపిలో ఉన్న సోదరుడు మోహన్ రెడ్డికా, లేక చిరకాల రాజకీయ ప్రత్యర్థి భూమా వర్గానికి మద్దతు పలుకుతారా అనే చర్చ సాగుతోంది.మంత్రి అఖిలప్రియ, భూమా కుటుంబం చక్రపాణి రెడ్డిని ఉద్దేశ్య పూర్వకంగానే దూరం పెడుతోందని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.

ఇవ‌న్నీ బాగానె ఉన్నా లోపల జరుగుతున్న పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదంటున్నారు. ఇప్పటికే మండలి చైర్మన్ పదవి మిస్ అయింది. ఇప్పుడు అఖిల కూడా దూరం పెడుతుండటంతో ఆయన మరింత ఆవేదనగా ఉన్నారని చెబుతున్నారు.

సోదరుడు మోహన్ రెడ్డి దారిలోనే శిల్పా చక్రపాణి రెడ్డి కూడా వైసిపిలో చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఆగస్ట్ 3న జగన్ నంద్యాలలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శిల్పా సోదరుల భేటీపై సర్వత్రా చర్చ సాగుతోంది.వైసీపీలో చేరినా ఆశ్చ‌ర్య‌పోవ‌ల‌సిన అవ‌స‌రం లేద‌నే భావ‌న వినిపిస్తోంది.

https://www.youtube.com/watch?v=5fw3RGyDUzo

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -