Monday, April 29, 2024
- Advertisement -

ప‌వ‌న్ ఒక‌సారి ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలి…

- Advertisement -

ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనే లక్ష్యంగా అమరావతిలో మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో సారి అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి హాజ‌రుకావాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల‌ను ఆహ్వానించారు బాబు. .

రెండో సారి ఏర్పాటు చేసిన అఖిల ప‌క్ష స‌మావేశానికి ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు చలసాని శ్రీనివాస్, శివాజీ, సచివాలయ, ప్రభుత్వ, రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. అయితే వైసీపీ, భాజాపా, సీపీఎం, సీపీఐ, జ‌న‌సేన పార్టీలు రామ‌ని తేల్చి చెప్పాయి. దీనిపై ప్ర‌త్యోక హోదా సాధ‌న మితి నేత హీరో శివాజీ ప‌వ‌న్‌పై ఘాటుగా విమ‌ర్శ‌లు చేశారు.

గత అఖిలపక్ష సంఘాల సమావేశానికి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తాను రాలేకపోయానని చెప్పారు. ప్రజలను గందరగోళానికి గురి చేసేలా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అపరేషన్ గరుడ అనేది నిజమేనని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఈ ఉద్యమంలోకి ఎప్పుడు వచ్చారో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. జాతీయ పార్టీల ఉచ్చులో కొన్ని పార్టీలు పడుతున్నాయని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -