పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగనందున ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా ప్రధాని మోదీ ఒక రోజు దీక్ష చేసిన సంగతి తెలిసిందే. మోదీ దీక్షను చంద్రబాబు తప్పుబట్టారు. ప్రధాని హోదాలో కూర్చుని, అధికారాన్ని చేతులో పెట్టుకుని దీక్ష ఏమిటి? ఇలా దీక్షలు చేసిన ప్రధాని ఎవరూ లేరు అని బాబు ఫైర్ అయ్యాడు. సీన్ కట్ చేస్తే బాబుకూడా మోదీ బాటలో ఒక రోజుదీక్షకు దిగుతున్నారు.
ఉచిత విద్యుత్, రాష్ట్ర విభజన, ప్రత్యేకహోదా.. ఇలా ప్రతి విషయంలోనూ మొదట విమర్శించడం తర్వాత అదే పని చేస్తానని అనడం. మొదట తప్పు అనడం తర్వాత ఒప్పు అనడం లేదా, మొదట సమర్థించడం తర్వాత విమర్శించడం. దటీజ్ చంద్రబాబు
బాబు చేస్తున్న దీక్షపై జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. నాలుగేళ్ల నుంచి హోదా విషయంలో చంద్రబాబు ఎంత చిత్తశుద్ధి చూపించారో అందరికీ తెలిసిందే అని, హోదా అంటే జైలుకు పంపిస్తా అని హెచ్చరించిన చంద్రబాబు ఇప్పుడు హోదా కోసం ఒక రోజు దీక్ష అనడం విడ్డూరమని జగన్ వ్యాఖ్యానిం చారు.
చంద్రబాబు దొంగ దీక్షలు చేయడం కాదు, దమ్ముంటే ఎంపీల చేత రాజీనామాలు చేయించాలని జగన్ సవాల్ విసిరాడు. తెలుగుదేశం ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే, హోదా కోసం ఈ పని చేస్తే ప్రయోజనం ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డాడు. కొంగజపాలు చేయడం కాకుండా, చంద్రబాబు పనికొచ్చే పని చేయాలని జగన్ సూచించాడు.