వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పాదయాత్రను ప్రకటించినప్పటినుంచి అధికారపార్టీలో గుబులు మొదలయ్యింది. అప్పటినుంచి పచ్చపార్టీనేతలు అందరూ జగన్ను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. అసలు పాదయాత్ర ఎలాచేస్తోరో చూస్తాం, జైలుకెల్లడం ఖాయం అని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. చివరకు పాదయాత్ర మొదలయ్యింది. అయినా కూడా జగన్మీద ఆరోపనలు చేయడం మానుకోవడంలేదు సరికదా …విమర్శలకు మరింత పదును పెట్టారు.
ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజలనుంచి వస్తున్న రెస్పాన్స్ను చూసి పచ్చపార్టీనేతలకు మింగుడు పడటంలేదు. వరుసపెట్టి మంత్రులందరూ మాటలదాడిని పెంచారు. సోమిరెడ్డి,యనమల తర్వాత ఇప్పుడు ఆపార్టీ నేత కళా వెంకట్రావ్ జగన్ను విమర్శించారు. ఏపార్టీకైనా పాలసీ, నిబద్ధత ఉండాలని అవి రెండు జగన్కు లేవన్నారు.
ప్రజా సమస్యలను చర్చించే వేదిక అసెంబ్లీ అని…జగన్కు పదవీ కాంక్ష తప్ప ప్రజల సమస్యలు పట్టడంలేదని ఆరోపించారు. పాదయాత్ర చేస్తేనే సీఎం అవుతారంటే ఎవరైనా చేస్తారని అన్నారు. ప్యారడైజ్ పేపర్లలో జగన్ పేరు ప్రస్తావించారని..ఇందుకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని అన్నారు.