Wednesday, April 24, 2024
- Advertisement -

టీడీపీనుంచి మ‌రో రెండు వికెట్లు డౌన్‌…త్వ‌ర‌లో వైసీపీలోకి..?

- Advertisement -

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ రాజ‌కీయనాయ‌కుల గోడ దూకుళ్లు ఎక్కువ అవుతున్నాయి. ప్ర‌ధానంగా అధికార‌పార్టీ టీడీపీనుంచి గోడ దూకే నాయ‌కులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేల కీల‌క నేత‌లు టీడీపీ గోడ దూక‌డం ఆ పార్టీకి తీవ్ర న‌ష్ట‌మ‌నే చెప్పాలి. తాజాగా క‌ర్నూలు జిల్లాలో టీడీపీకి త్వ‌ర‌లో బిగ్ షాక్ త‌గ‌ల‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. పార్టీకి చెందిన కీల‌క నేత‌లు గోడ దూకేందుకు సిద్ద‌మ‌య్యారు.

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు ఆయ‌న అల్లుడు టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్ శ్రీధ‌ర్ రెడ్డి టీడీపీని వీడ‌నున్నార‌ని నంద్యాల రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. నంద్యాల ఎంపీ, అసెంబ్లీ టికెట్ల‌ను అడిగిన వీరికి చంద్ర‌బాబు మొండిచేయి చూప‌డంతో పార్టీని వీడేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

ఎంపీ సీటుగాని, ఎమ్మెల్యే సీటుగాని బాబు కేటాయిస్తార‌ని గ‌త కొన్ని రోజులుగా ఆశ‌లు పెట్టుకున్నారు. అటు ఎంపీగానీ..ఇటు అసెంబ్లీ టికెట్ గానీ ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని భావించిన వారు వైసీపీలో చేరేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే మామ‌, అళ్లుడు త‌మ కార్య‌క‌ర్త‌ల‌తో పార్టీ మార్పుపై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. వైసీపీనుంచి ఎంపీగా గెలిచిన ఎస్టీవై రెడ్డి జ‌గ‌న్‌కు హ్యండ్ ఇచ్చి టీడీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీలో చేర‌డానికి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ వాళ్ల‌ను వైసీపీలోకి రాణిస్తారా అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -