ఇటీవల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలియకతో టీడీపీ,జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్టే అన్న చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎవరు ఏ సీట్లలో పోటీ చేస్తారు అన్నదే ముఖ్యం కానుంది. మరో పక్క చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వానికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన సీట్ల పంపకం విషయంలో బేరం కుదరడంలేదు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ 60 ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే 24 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఇస్తాము… అందులో మీరు 5 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలవగలరు అని టీడీపీ అంటున్నట్టు సమాచారం. అయితే ఈ సీట్లు విషయం లో బీజేపీ పవన్ కళ్యాణ్ తో పొలిటికల్ గేమ్ అడుతుందా..? అంటే అవ్వును అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు బీజేపీ తో పొత్తు ప్రయత్నం చేస్తుంటే బీజేపీ నుంచి ఎలాంటి సిగ్నల్స్ రావడం లేదు. మరోపక్క వైసీపీ, బీజేపీ మధ్య సత్ సంబంధాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ తో బాగా టచ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈమధ్యనే ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కలవడం జరిగింది. ఇదంతా బీజేపీ గేమ్ ప్లానేనా..? పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు కు బీజేపీ ఎర గా వేసిందా..? ఎందుకంటే మద్దతుతో గెలిచిన తర్వాత అధికారం దక్కించుకోవడం బీజేపీ కి వెన్నతో పెట్టిన విద్య. ఓ పక్క వైసీపీతో బీజేపీ దోస్తీ మరోపక్క పవన్ కళ్యాణ్ ను దువ్వడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ అడ్డుపెట్టుకొనిను రాజకీయ ఆట ఆడుతుందా..? పవన్ ను మరో ఏక్ నాథ్ సిండే చేయబోతుందా..?
ఈ రాజకీయ ఆటలో బీజేపీ జరికే నష్టం లేదు.. ఎందుకంటే టీడీపీ, జనసేన పొత్తు తో గెలిస్తే అధికారం.. లేకపోతే ఎట్లాగు వైసీపీ దోస్తీ ఉండనే ఉంది. ఎటొచ్చి చంద్రబాబుకు దెబ్బ పడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.
-Anjanreddy kodathala