Friday, May 10, 2024
- Advertisement -

మోదీ అంటె ప‌వ‌న్‌కు వ‌ణుకు: మంత్రి కొల్లు ర‌వీంద్ర‌

- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాన్‌పై టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. గుంటూరులో జ‌రిగిన జ‌న‌సేన ప్లీన‌రీ స‌మావేశంలో టీడీపీని టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో టీడీపీ నేత‌లు ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. తాజాగా టీడీపీ మంత్రి కొల్లు ర‌వీంద్ర జ‌న‌సేనుడిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప్రజాసేవ కోసం నారా లోకేశ్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. ఆయనపై ఆరోపణలు సరికావని అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ శైలి ఒక‌రోజు సినిమా సెట్లో మ‌రోరోజు రాజ‌కీయ సెట్లో ఉన్న‌ట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూస్తే ప‌వ‌న్ క‌ల్యాణ్ భ‌య‌ప‌డుతున్నారని, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలను తాక‌ట్టు పెడుతున్న ప‌వ‌న్ కు ప్ర‌జ‌లే తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -