వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన నేతలకు బాబు తత్వం భోధపడినట్లుంది. పార్టీ మారే సమయంలో తమ నియోజక వర్గాల్లో అభివృద్దికోసం అని చెప్పిన నాయకులకు బాబు షాక్ ఇచ్చారు. అభివృద్ధిపనులు కాదు కదా మరో సారి టికెట్ ఇవ్వకుండా ఫిరాయింపునేతలందర్నీ నిలువునా ముంచేశారు. తాజాగా యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు బాబుపై ఫైర్ అయ్యారు. బాబు నమ్మి నిలువునా మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొత గూటికి చేరుకున్న ఆయన బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అన్నదమ్ముల్లా ఉండే మాల-మాదిగల మధ్య చిచ్చు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని.. వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని నమ్మించి మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో మాదిగలు సభలు జరుపుకోకుండా చంద్రబాబు అడ్డుకున్నారని మండిపడ్డారు.తన దగ్గర డబ్బులేదనే టీడీపీ టికెట్ ఇవ్వలేదని, సామాన్యులకు టికెట్ ఇచ్చే గొప్ప వ్యక్తి వైఎస్ జగనని కొనియాడారు. అందుకు నిదర్శనం బాపట్ల పార్లమెంట్కు పేదవాడైన నందిగం సురేశ్కు టికెట్ ఇవ్వడమేనన్నారు. నందిగం సురేశ్కు మద్దతు తెలుపుతూ.. బాపట్ల లోక్సభకు తాను స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. నందిగం సురేశ్ విజయానికి, వైఎస్ జగన్ను సీఎం చేయడానికి కార్యకర్తలా పనిచేస్తానన్నారు.
- Advertisement -
బాబు నమ్మించి తడి గుడ్డతో గొంతు కోశారు….ఎమ్మెల్యే ఆవేదన
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -