Tuesday, May 7, 2024
- Advertisement -

టీడీపీనుంచి మ‌రో వికెట్ డౌన్.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన మాజీ మంత్రి

- Advertisement -

అధికార తెలుగుదేశం పార్టీకి షాకులు తప్పవా. ఓ వైపు తెలంగాణాలో ప్రజా కూటమి విజయంలో తమ విజయం చూసుకుందామని తపన పడుతున్న పసుపు పార్టీ నేతలకు షాకులు ఇచ్చేందుకు ఏపీ తమ్ముళ్ళు సిధ్ధంగా ఉన్నారు. పార్టీలోని అసంత్రుప్తివాదులు జంప్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరి మటుకు వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే మాజీ మంత్రి ప్ర‌స్తుత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రావెల కిషోర్ బాబు ప‌ద‌వికి, పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు.

మంత్రిగా ఉన్న ప్పుడు ఆయ‌న‌మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో మంత్రి ప‌ద‌విని కోల్పోయారు. అప్ప‌టినుంచి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న ఆయ‌న నేడు రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో అందజేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపిన మీదట రావెల ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇకపోతే రావెల కిషోర్ బాబు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. గత కొంతకాలంగా టీడీపీలో అసంతృప్తిగా ఉన్న ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే జగన్ నుంచి రావెల చేరికపై ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన జనసేనలో చేరబోతున్నారు.

ఇప్ప‌టికే ప‌వ‌న్‌తో అనేక సార్లు చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం..పార్టీలో చేరేందుకు రావెల ఈ నిర్ణయం తీసుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపిన మీదట రావెల ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు నాగార్జున యూనివర్సిటీ నుంచి అభిమానులతో ర్యాలీగా వెళ్లి విజయవాడలో పవన్ సమక్షంలో రావెల జనసేన కండువా కప్పుకోనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -