Sunday, May 19, 2024
- Advertisement -

జ‌న‌సేన‌, వైసీపీలు ద‌గాకోరు పార్టీలు… డొక్కా

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌పుడుత‌న్న కొద్ది రాజ‌కీయ పార్టీల మ‌ధ్య మాట‌ల‌తూటాలు పేలుతున్నాయి. వైసీపీ, జ‌న‌సేన బాబును విమ‌ర్శిస్తుంటే… టీడీపీనేత‌లు కూడా అంతే స్థాయిలో మాట‌ల దాడిని కొన‌సాగిస్తున్నారు. తాజాగా టీడీపీ నేత డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ జ‌న‌సేన‌, వైసీపీల‌పై నిప్పులు చెరిగారు.

రాష్ట్ర అభివృద్ధికోసం బాబు క‌ష్ట‌ప‌డుతుంటే ప్ర‌తిప‌క్షాలు లేనిపోని ఆరోప‌న‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. చంద్రబాబు వల్లే ఏపీకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి శ్రమను కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం ప‌ట్ల కేంద్రం వివ‌క్ష చూపుతోంద‌న్నారు.

దేశానికి కూడా బీజేపీ అవసరం లేదని . రాష్ట్రాల హక్కులను బీజేపీ కాలరాస్తోందని దుయ్యబట్టారు. వైసీపీ, జనసేన పార్టీలకు బీజేపీని నిలదీసేంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ లను తిట్టడమే వైసీపీ, జనసేనలు పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలు దగాకోరు పార్టీలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -