Tuesday, May 14, 2024
- Advertisement -

ప‌వ‌న్‌, జ‌గ‌న్‌పై టీడీపీఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ సెటైర్స్‌..

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై టీడీపీ మాట‌ల దాడిని పెంచింది. గ‌తంలో జ‌గ‌న్‌నే టార్గెట్ చేసిన ప‌చ్చ‌బ్యాచ్ ఇప్పుడు ప‌వ‌న్‌ని కూడా టార్గెట్ చేశారు. జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ టీడీపీపై చేసిన ఆరోప‌న‌లు తెలిసిందే. కొద్ది సేప‌టిక్రితం టీడీపీ ఎంపీ జేసీ చేసిన వ్యాఖ్య‌లు మ‌రువ‌క ముందే తాజాగా మ‌రో ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ సెటైర్లు వేశారు.

ప‌వ‌న్‌, జ‌గ‌న్‌పై వ్యాంగ్యాస్త్రాలు సంధిస్తూ ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. అంద‌రినీ క‌డుపుబ్బా న‌వ్విస్తోంది. త్వ‌ర‌లో జ‌గ‌న్‌-ప‌వ‌న్ కొత్త సినిమా విడుద‌ల అవుతుందంటూ చ‌లోక్తులు విసిరారు. రచన, దర్శకత్వం ప్రశాంత్ కిషోర్ .. మోదీ – షా ప్రొడక్షన్స్ సమర్పణలో ఈ చిత్రం మీ ముందుకు రానుంది’ అని గల్లా జయదేవ్ ‘ఫేస్ బుక్’ పోస్ట్ చేశారు.

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నిర్వహించిన ‘సైకిల్ యాత్ర’లో పాల్గొన్న జ‌య‌దేవ్ కేంద్రం తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. విభ‌జ‌న స‌మ‌యంలో కేంద్రం ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌కుండా కేంద్రం నాట‌కాలాడుతోంద‌న్నారు. ఆంధ్రప్రదేశ్ కు అప్పులు ఇచ్చారని, ఉద్యోగులు, నీటి పంపకాల విషయంలో స్పష్టత లేదని మండిపడ్డ గల్లా, ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -