అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆయనే తెలియదు. ఎప్పుడు జగన్ పొగుడుతాడో…ఎప్పుడు బాబును తిడతాడో ఎవరికీ అర్థం కాదు. ఈ రెడ్డిగారు మీడియా ముందుకు వస్తే చాలు సంచలన, వివాదస్పద వ్యాఖ్యలకు కొదువ ఉండదు. సీఎం చంద్రబాబును మొదలుకుని ప్రధాని నరేంద్ర మోదీపై సైతం తనదైన శైలిలో జేసీ వ్యాఖ్యలు చేస్తుంటారు. గతంలో జగన్పై అనేక సార్లు విమర్శలు చేసిన జేసీ తాజాగా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీకీ 25 ఎంపీ స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదాపై ఎవరు సంతకం పెడతారో వారికే తమ మద్దతు ఇస్తామని జగన్ చేసిన వ్యాఖ్యలపై జేసీ అనూహ్యంగా స్పందించారు. జగన్ 25 ఎంపీ స్థానాలు కోరుకోవడం తప్పు లేదన్న ఆయన.. ప్రజలు జగన్కు ఇవ్వాలి.. ఇస్తే సంతోషం. 25 స్థానాలు ఇవ్వకపోతే ఇంటికి పోతాడు. అంతే అని జేసీ చెప్పుకొచ్చారు. జేసీ వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తలు ప్రశంశ వర్సం కురిపించగా….టీడీపీ నేతలు మాత్రం ఒకింత షాక్ కు గురయ్యారు.
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి టీడీపీకి ఏ పార్టీ మద్దతు అక్కర్లేదని.. ఒంటరిగానే పోటీచేసి టీడీపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఒక్కరే చెబితే ప్రధాని అవ్వరని.. అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్లి ప్రధానిని ఏర్పాటు చేసుకోవాలని జేసీ చెప్పుకొచ్చారు. తెలంగాణలో మహాకూటమి గెలవాలని తాను కోరుకుంటున్నానని.. అయితే ప్రజలు ఏం తీర్పునిస్తారో వేచి చూడాల్సిందేనని జేసీ తెలిపారు.