టీడీపీ ఎంపీ శివప్రసాద్ గురించి తెలియని వారుండరు. ఈ యన సినిమాలకు ఎక్కువ…రాజకీయాలకు తక్కువ. ఎప్పుడూ ఏదొక వేషదారణతో ప్రజలను ఎంటర్టైన్ చేస్తుంటాడు.గత కొద్దిరోజులుగా ఏపీకీ ప్రత్యేకహోదా, ఇతర హామీలను నెరవేర్చాలని పార్లమెంట్ ముందు విచిత్ర వేషధారణలతో నిరసన తెలుపుతున్న కామెడీనీ చూశాం. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ఏమో గాని ప్రజలు మాత్రం పుల్ ఎంటర్టైన్ అవుతున్నారు.
తాజాగా పార్లమెంట్ముందు కొత్త వేషధారణతో దర్శనమిచ్చారు శివప్రసాద్. ఇవాళ హిజ్రా వేషంలో కనిపించారు. రోజూ వేషాలు వేసి నిరసన తెలియజేసినా ప్రధాని మనసు కరగలేదన్నారు శివప్రసాద్. అందుకే ఇప్పుడు ఈ వేషం వేయాల్సి వచ్చిందన్నారు.
‘మోదీ బావా.. మాటలెన్నో చెప్పావు.. చేతల్లో ఏమీ చూపించలేదు.. ప్రత్యేక హోదా ఇవ్వవా.. ఇదే అంతం ఆరంభం’ అంటూ చమత్కరించారు. మరోవైపు విచిత్ర వేషాలతో నిరసన తెలుపుతున్న శివప్రసాద్ను కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా, ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్లు అభినందించారు.
గతంలోకూడా చాలా విచిత్ర వేషధారనలతో కనిపించారు సదరు టీడీపీ ఎంపీగారు శివప్రసాద్ . రోజుకొక వేషధారనలను చూసి ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్రం తెగేసి చెప్పినా ఈయన వేసే వేషాలు ప్రజలకు ఎంటర్టైన్ తప్ప రాష్ట్రానికి ఇసుమంతైనా ఉపయేగం ఉటుందా..!