- Advertisement -
తెలంగాణా ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తం ప్రకారం 2.34 గంటలకు గజ్వేల్లోని ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్ ఆర్డీవో కార్యాలయానికి హరీష్ రావుతో పాటు మరో ముగ్గురితో కలిసి ఆయన వెళ్లినట్టు సమాచారం. ఎటువంటి అంగు ఆర్భాటం లేకుండా నామినేషన్ వేశారు.
అంతకు ముందు సీఎం హెలికాప్టర్లో వెల్లి నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వెంకన్న ఆలయానికి చేరుకొని.. నామినేషన్ పత్రాలను వెంకన్న చెంత పెట్టి పూజలు నిర్వహించారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసారు.అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.
తులకు అప్పులు లేని తెలంగాణే బంగారు తెలంగాణ అన్నారు. దేశంలో 24 గంటల విద్యుత్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. రైతుల ఆదాయం పెరగాలని, దేశంలోనే ధనిక రైతులకు తెలంగాణే వేదికవ్వాలని ఆకాంక్షించారు.