మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చేయించిన ఓ సర్వే కరీంనగర్ జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచింది. ఆయన చేసిన అన్ని సర్వేలు దాదాపు నిజమయ్యాయనే చెప్పాలి. ఇప్పటికే లగడపాటి సర్వేపై రాజకీయ పార్టీలు, ప్రజలు తీవ్రంగా చర్చించుకుటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో 8 నుంచి 10 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని… వీరిలో నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి, బోథ్ నుంచి అనిల్ కుమర్ జాదవ్ లు గెలుపొందుతారని ఇటీవల ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రతి రోజు ఇద్దరు గెలుపు గుర్రాల పేర్లను వెల్లడిస్తానని చెప్పిన లగడపాటి… మేటర్ కాస్తా ఈసీ వరకు వెళ్లడంతో మౌనం వహించారు. తాజాగా ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. తాజాగా కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు లగడపాటి ఫోన్ చేశారనీ, తను చేయించిన సర్వే వివరాల్ని ఆయనకు చెప్పారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
లగడపాటి రాజగోపాల్, మేడిపలి సత్యంలు తెలంగాణ ఉద్యమంలో హోరాహోరీగా తలపడ్డారు. లగడపాటి స్వయంగా మేడిపల్లి సత్యంకు ఫోన్చేసి… చిన్న వయసులోనే పెద్ద ఫాలోయింగ్ సంపాదించావు… ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నావు… ఇది ఎలా సాధ్యమయింది అని అడిగినట్లు తెలిసింది. తాను చేయించిన సర్వే వివరాలతోపాటు, ఈ ఎన్నికల్లో సత్యంకు ఎన్ని ఓట్లు వస్తాయి అనేది లగడపాటి తెలిపినట్లు సమాచారం.