Sunday, May 19, 2024
- Advertisement -

నేను మీప‌ప్పులాకాదు.. ఉత్త‌మ్‌కు కేటీఆర్ కౌంట‌ర్‌..

- Advertisement -

తెలంగాణాలో ఎన్నిక‌ల వేడి ఒక వైపు మ‌రో వైపు కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల ప‌ర్వం తారాస్థాయికి చేరింది. అమెరికాలో అంట్లు తోమిన కల్వకుంట్ల రామారావు(కేటీఆర్) రాజకీయాల గురించి తమకు చెప్పకూడదని ఉత్త‌మ్ ఆరోపించారు. పీసీసీ ఛీప్ ఉత్త‌మ్ చేసిన వ్యాఖ్య‌ల కేటీఆర్ ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు.

అమెరికాలో సగటు భారతీయుడిలా తాను ఉద్యోగం చేసి సంపాదించి గౌరవంగా బతికాననీ, దీనిపై గర్వపడుతున్నానని తెలిపారు. పప్పూలా (రాహుల్ గాంధీ) తానేమీ ప్రజా ధనాన్ని దోచేయలేదని విమర్శించారు. అలాగే దోచుకున్న ప్రజాధనాన్ని మీలా కారుతో సహా కాల్చేయలేదని ఉత్తమ్ కు ట్విట్ట‌ర్‌లో కౌంటర్ ఇచ్చారు. ఈ ట్వీట్ కు రెండు పేపర్ కటింగ్ లను కూడా మంత్రి జతచేశారు.

అలాగే ఆపిల్‌ కంపెనీ వ్యవహారంలో ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్‌ కుంతియా చేసిన వ్యాఖ్యలను మరో ట్వీట్‌లో కేటీఆర్‌ తిప్పికొట్టారు.‘ ఏఐసీసీ జెంటిల్‌మెన్‌.. స్కాంగ్రెస్‌ జోకర్‌ ఆజ్ఞానంతో మాట్లాడుతున్నారు. 2016లోనే ఆపిల్‌ కంపెనీ హైదరాబాద్‌లో తన వ్యవహారాలను ప్రారంభించింది. ప్రస్తుతం 3500 మందికి పైగా ఉద్యోగులతో అమెరికా తర్వాత అతిపెద్ద సెంటర్‌గా నిలిచింది’  అని ట్వీట్‌ పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -