Thursday, May 9, 2024
- Advertisement -

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న తెలంగాణా టీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌. ర‌మ‌ణ‌

- Advertisement -

త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో టీడీపీ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది. మ‌హాకూట‌మిలో కీల‌క పాత్ర పోషించారు ర‌మ‌ణ‌. ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

జగిత్యాల కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డికి అండగా నిలిచారు. 1994లో తొలిసారిగా జగిత్యాల నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగి గెలిచిన రమణ.. అక్కడి నుంచి ఐదుసార్లు పోటీచేశారు. 1994లో మంత్రిగా పనిచేశారు. మహాకూటమిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని రమణ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -