Monday, May 20, 2024
- Advertisement -

కారెక్క‌నున్న మ‌రో టీడీపీ సీనియ‌ర్ నేత‌…

- Advertisement -

తెలంగాణా టీడీపీకి క‌లులేని దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతున్నాయి. ఇక ఆపార్టీ క‌నుమ‌రుగు అవ‌డం ఖాయ‌మ‌నవార్త‌ల‌కు బ‌లం చూకూరుతోంది. టీటీడీపీకి రేవంత్‌ రెడ్డి గుడ్ బై చెప్పిన త‌రువాత ఆ పార్టీ నుంచి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భారీగా వ‌ల‌స‌లు వెళుతోన్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్ష పదవికి గండ్ర సత్యనారాయణ రావు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపినట్టు సత్యనారాయణ తెలిపారు.

బుధవారం గండ్ర టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. గండ్ర సత్యనారాయణ గత 30 సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగుతున్నారు. సర్పంచ్‌, జెడ్పీటీసీ గా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజక వర్గం నుంచి టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు.

అంతే కాకుండా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు టీడీపీ సీనియర్‌ నేతలు కూడా వలసల బాట పడుతున్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పేర్యాల (కిమ్స్‌) రవీందర్‌రావు, మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రు నాగయ్య టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవలే రేవంత్‌రెడ్డి నేతృత్వంలో పెద్దఎత్తున ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు కాంగ్రెస్‌తో చేయి కలిపిన విషయం తెలిసిందే. ఇక పార్టీలో చివ‌ర‌కు ఎవ‌రు మిగులుతారో అనేది హాట్‌టాఫిక్‌గా మారింది. ఇక తెలంగాణాలో బాబు టీడీపీని మ‌ర‌చిపోయిన‌ట్టేనా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -