ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రతిపక్షాల నాయకులు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని టి.ఆర్.ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. ఉద్యోగాలపై పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేతల ఓకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి బీజేపీ తన ప్రాబల్యం నిరూపించుకోవడానికి పూర్తి స్థాయిలో అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలు పెట్టాయి. దానికి తగ్గట్టుగానే అధికార పార్టీ సీనియర్ నేతలు కూడా ధీటుగా సమాధానాలు ఇవ్వడం మొదలు పెట్టారు.
టి.ఆర్.ఎస్ హయాంలో 2014 నుంచి ఇప్పటి వరకు లక్ష 31 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కొందరు నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమానికి పట్టభద్రులు, టి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.
టైం అయిపోయింది.. మిగిలింది అక్కడే..!