Monday, April 29, 2024
- Advertisement -

అదే జరిగితే.. పార్టీని వీడుతాను? : వి.హనుమంతరావు

- Advertisement -

టీపీసీసీకి కొత్త సారథి ఎవరు అన్న విషయం పై ఇప్పటి వరకు తర్జన భర్జన జరుగుతూ ఉంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణమైన పరాజయం పొందుతూ వస్తున్న విషయం తెలిసిందే. మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరీ ఘోరపరాభవం పొందింది. పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా ఇచ్చిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి తెలంగాణ లో పీసీసీ పదవిలోకి ఎవరు వస్తారన్న విషయం పై ఆసక్తి నెలకొంది. టీపీసీసీకి కొత్త సారథి దాదాపు ఖరారయ్యారు.

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించేందుకు అధిష్ఠానం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రేవంత్ రెడ్డికి ఆ పట్టం కడితే.. తాను కాంగ్రెస్ పార్టీలో ఉండబోనని అన్నారు.పార్టీ కోసం ఎంతో కాలంగా పని చేస్తున్న కోమటిరెడ్డి, జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ గా పనికిరారా? అని ఆయన ప్రశ్నించారు. నేను మాత్రమే కాదు.. ఇదే జరిగితే కాంగ్రెస్ లో చాలా మంది వైతొలుగుతారని అన్నారు.

తెలుగుదేశంలో ఉండి ఆ పార్టీని ఖతం చేసిన రేవంత్ రెడ్డి… ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా నాశనం చేస్తారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఢిల్లీని కూడా మేనేజ్ చేస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు.  వంత్ రెడ్డికి ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించిన వీహెచ్… దీనికి సంబంధించి సీబీఐకి లేఖ రాస్తానని చెప్పారు. వీహెచ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -