Monday, April 29, 2024
- Advertisement -

రామ్ సినిమాలు కమ్మవాళ్లే చూస్తారా.. చంద్రబాబే ముప్పు : వల్లభనేని వంశీ

- Advertisement -

ఏపీలోని విజయవాడలో గల కోవిడ్ కేర్ సెంటర్ స్వర్ణ హాస్పిటల్ ఆగ్ని ప్రమాదంపై టాలీవుడ్ యంగ్ హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పై కూడా సంచలన కామెంట్లు చేశారు. కులం పేరుతో బాబు రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

విజయవాడ రమేష్ ఆస్పత్రి గురించి హీరో రామ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివాడని.. రామ్ సినిమాలు ఒక్క కమ్మ వాళ్ళు మాత్రమే చూస్తారా అని వంశీ అన్నారు. వేరేవాళ్ళు రామ్ సినిమాలు చూడరా అని అడిగారు. వేరే కులం వారిని సినిమాలు చూడవద్దని చెప్పమనండని ఆయన అన్నారు. కమ్మ సామాజిక వర్గానికి బాబు వల్ల ప్రమాదం జరిగే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారికి సంక్షేమ పథకాలను గౌవర్నమెంట్ ఆపిందా అని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు ఒక్కడే తమ సామాజిక వ్రగానికి నాయకుడు కారని, గతంలో చాలా మంది నాయకులు తమ సామాజిక వర్గం కోసం పనిచేశారని ఆయన అన్నారు. చంద్రబాబుతోనే తమ సామాజిక వర్గానికి ముప్పు ఉందని… పదేళ్లు హైదరాబాదులో ఉండే ఛాన్స్ ఉన్నా.. ఒటుకు నోటు కేసులో చిక్కుకుని.. అక్కడ ఉండలేక ఎమ్మెల్యేలను విజయవాడకు తీసుకుని వచ్చారని బాబుపై ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిసారి అమరావతి అంటున్న బాబు.. హైదరాబాద్ లో మాత్రం రూ.300 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడని ఆయన అన్నారు.

ఆదినారాయణ రెడ్డికి హైకోర్ట్ షాక్.. జగన్ సర్కార్ నిర్ణయం కరెక్ట్..!

చంద్రబాబు కాల్ చేస్తే.. బ్లాక్ చేసిన టీడీపీ లీడర్లు..!

రాపాక విషయంలో జగన్ ను ఫాలో అవుతున్న పవన్.. ఎలా అంటే ?

వైఎస్సార్‌ చేయూత.. మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -