Monday, May 20, 2024
- Advertisement -

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వ‌నున్న వంగ‌వీటి కుటంబీకులు …

- Advertisement -

బెజవాడ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తుంటే మ‌రో వైపు ముఖ్య‌నేత‌లు పార్టీని వ‌దిల ఇత‌ర పార్టీల‌ల్లోకి వెల్తున్నారు. తాజాగా బెజ‌వాడ‌లో వైసీపీకీ బిగ్‌షాక్ త‌గిలింది. వంగ‌వీటి క‌టుంబీకులు ఒక్క క్క‌రే పార్టీనీ వీడుతున్నారు.

తాజాగా వంగ‌వీటి రాధాకృష్ణ పార్టీ మారే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీకి తనకు హామీ ఇవ్వలేదని వంగవీటి రాధాకృష్ణ అసంతృప్తితో ఉండి, అనుచరులతో చర్చలు సాగిస్తున్నారు. దీంతో తీవ్రమైన అసంతృప్తితో ఉన్న రాధాకృష్ణ, నిన్న పార్టీ ముఖ్య నేతల సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వెళ్లిపోయారు.

వైకాపాలో తగినంత గుర్తింపు లభించడం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీని వీడిన పక్షంలో ఏ పార్టీలో చేరాలన్న విషయంలో కూడా అనుచరులతో ఆయన మంతనాలు సాగించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే వంగవీటి కుటుంబ సభ్యుడు శ్రీనివాస ప్రసాద్ వైకాపాకు రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను వైకాపా కార్యాలయానికి ఫ్యాక్స్ చేశారు.

జగన్ వైఖరిని నిరసిస్తూ, పార్టీకి, పదవులకు రాజీనామా చేసినట్టు వెల్లడించారు. పార్టీలో కష్టపడుతున్న వారికి గుర్తింపు లభించడం లేదన్న ఆవేదనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వైకాపాకు వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్న వేళ, శ్రీనివాస ప్రసాద్ ముందే రాజీనామా చేసి కలకలం సృష్టించడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -