Saturday, May 4, 2024
- Advertisement -

శవాలపై పేలాలు ఏరుకునేవాడిలా నీ శవ రాజకీయాలేంటి చంద్రబాబూ? : విజయసాయిరెడ్డి

- Advertisement -

గత కొంత కాలంగా అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. దానికి తోడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార పక్షం విజయఢంకా మోగించగా అంతా మోసపూరిత గెలుపు అంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఇదిలా ఉంటే టీడీపీ నేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేధికగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శవాలపై పేలాలు ఏరుకునేవాడిలా నీ శవ రాజకీయాలేంటి చంద్రబాబూ? శవం దొరికితే చాలు రాబందులా వాలి రాజకీయం చేస్తున్నావు.

ఇంత దరిద్రపు ప్రతిపక్షం ఎక్కడా లేదు. డాక్టర్ సుధాకర్ మృతితో ఆ కుటుంబం విషాదంలో ఉంటే నీ పాలిట్రిక్స్ ఏంటి? అంత ప్రేమున్నోడివి ఆయన ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఎందుకివ్వలేదు? అంటూ విమర్శించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -