Tuesday, May 7, 2024
- Advertisement -

మ‌రో సారి గుర‌వింద నీతులు చెప్పిన ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల‌….

- Advertisement -

గ‌తంలో వికీలీక్స్‌…మొన్న ప‌నామాపేప‌ర్స్‌…ఇప్పుడేమో ప్యార‌డైజ్ పేప‌ర్స్ వెలుగులోకి తెచ్చిన అంశాల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. న‌ల్ల‌కుబేరుల జాబితాను ఈ పేప‌ర్స్ బ‌య‌ట పెట్ట‌డంతో వారి గుండెల్లో రైల్లు ప‌రిగెడుతున్నాయి. ఈ పేప‌ర్స్‌తోనె న‌వాజ్ షరీఫ్ త‌న ప‌ద‌విని పోగొట్టుకున్నారు. చాలా దేశాల్లో ఈపేప‌ర్స్‌తాటూకా ర‌చ్చ ఓరేంజ్‌లో జ‌రుతుతోంది.

ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. గ‌తంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖుల పేర్ల‌లో జ‌గ‌న్‌పేరు ఉండ‌టంతో అప్ప‌ట్లో జ‌గ‌న్‌మీద టీడీపీ ఆరోప‌న‌లు గుప్పించింది. టీడీపీకి చెందిన కొందరు నేతల పేర్లు, టీడీపీకి ఆర్థికంగా అండదండలందిస్తోన్నవారి పేర్లూ ఆ పేపర్స్‌లో వెల్లడయినా, వాటిపైన మాత్రం టీడీపీ నేత‌లు స్పందించ‌రు.

ఇప్పుడు తాజాగా ప్యార‌డైజ్ పేప‌ర్స్ వెలుగులోకి వ‌చ్చింది. దీనిలో జ‌గ‌న్ పేరుని టీడీపీ అనుకూల మీడియా ప్రస్తావించింది. వెంట‌నె మ‌న ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఎంట‌ర‌య్యాడు. జగన్‌ ఆర్థిక నేరస్తుడనీ, ఆ విషయం ప్యారడైజ్‌ పేపర్స్‌ ద్వారా వెలుగు చూసిందనీ ప్రకటించేశారు. ఇదంతా బాగానె ఉంది కాని తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ టీడీపీ మంత్రులు నడుపుతున్న ‘సఖ్యత’, తెలంగాణలో ప్రాజెక్టుల కాంట్రాక్టుల్ని, మద్యం వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్ని ఏపీ టీడీపీ నేతలు, ముఖ్యంగా మంత్రులు నడుపుతున్న విషయాన్ని రేవంత్‌ బయటపెట్టారు. అందులో య‌న‌మ‌ల పేరుకూడా ఉంది.

జ‌గ‌న్ విష‌యం ప‌క్క‌న‌పెడితె గ‌డచిన మూడున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌కి జాతీయ స్థాయిలో ఎన్నో ఘనమైన ప్రత్యేకతలు దక్కాయి. అవన్నీ అవినీతి, దోపిడీ వంటి విభాగాల్లోనే కావడం గమనార్హం. త‌మ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిపోయిన వైనంపై జాతీయ స్థాయిలో వస్తున్న నివేదికల్ని మాత్రం పట్టించుకోరు.

చంద్రబాబు సర్కార్‌ దుబారా, ఆర్థిక మంత్రిగా యనమల చేతకానితనం.. వీటి కారణంగా ఖజానా లూటీ అయిపోతోందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. తమ వెనకాల ఇన్ని మచ్చలెట్టుకుని గుర‌వింద నీతులులాగా ప్యారడైజ్‌ పేపర్స్‌ ప్రస్తావన తీసుకురావడమంటే ఇంత‌క‌న్నా దౌర్భాగ్యం ఏముంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -