Sunday, April 28, 2024
- Advertisement -

లింగమనేనికి కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే…

- Advertisement -

ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హైస్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.తాజాగా తన ఇంటిని కూల్చవద్దంటూ లింగమనేని గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేశ్ సీఎం జగన్‌కు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ కు లింగమనేని రాసిన లేఖలో తనను చంద్రబాబునాయుడుకు బినామీగా జరుగుతున్న ప్రచారంతో మానసిక వేధనతో బాధపడుతున్నట్లు రాశారు. జరుగుతన్న ప్రచారంతో తానే కాకుండా తన కుటుంబసభ్యులు కూడా మానసికంగా బాధపడుతున్నట్లు లేఖలో తెలిపారు.

లింగమనేని రాసిన లేఖకు వైసీపీ ఎమ్మేల్యే ఆర్కే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని దేవినేని ఉమ అనలేదా ? అని ప్రవ్నించారు. అప్పట్లోనే తాడేపల్లి తహసీల్దార్ ఈ అక్రమ నిర్మాణానికి నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యానించారు.చంద్రబాబు ఆడించినట్టు లింగమనేని రమేశ్ ఆడుతున్నారని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు, లింగమనేని రమేశ్ కలిసి నాటకాలు, కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ల్యాండ్ పూలింగ్ ఆగిన చోట లింగమనేని రమేశ్ ఆస్తులు, భూములు ఉన్నాయని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు.. యజ్ఞాలు, యాగాలు చేసేందుకు ఇల్లు కట్టామని లింగమనేని రమేశ్ చెబుతున్నారని… ఐదేళ్లలో ఎన్ని యాగాలు అక్కడ చేశారని ప్రశ్నించారు.

ఐదేళ్లలో కోటి ఇరవై లక్షల హెచ్‌ఆర్ఏ తీసుకున్న చంద్రబాబు, లోకేశ్… వాటిని లింగమనేని రమేశ్‌కు చెల్లించారా ? ఒకవేళ చెల్లిస్తే దాన్ని లింగమనేని రమేశ్ తన ఐటీ రిటర్న్స్‌లో చూపించారా ? అని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రవ్నించారు. బాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ముమ్మాటికి అక్రమ కట్టడమేనని ఆర్కే ధ్వజమెత్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -