Monday, April 29, 2024
- Advertisement -

గంటాకు ఘాటుగా వార్నింగ్ ఇచ్చిన మంత్రి అవంతి శ్రీనివాస్

- Advertisement -

టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. అవంతిని ఒక మంత్రిగా తాను పరిగణించడం లేదని ఘాటుగా విమర్శలు చేశారు. అవంతిని ఒక మంత్రిగా తాను పరిగణించడం లేదని నిన్న గంటా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.గంటా కామెంట్స్‌పై తాజాగా మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీలో అయ్యన్నపాత్రుడుని అణగదొక్కేందుకు గంటా వచ్చారంటూ విమర్శలు గుప్పించారు. తాను అయ్యన్నపాత్రుడంత మంచివాడిని కాదన్నారు. తన జోలికి వస్తే గంటాను విశాఖలో ఉండకుండా చేసే శక్తి తనకుందంటూ సవాల్ చేశారు.తనతో పెట్టుకోవద్దంటూ గంటా శ్రీనివాసరావుకు వార్నింగ్ ఇచ్చారు.

నెల్లూరు మెస్ లో టికెట్లు అమ్ముకునే బాగోతం తనకు తెలుసనంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేను నోరు తెరిస్తే నీ బండారం బయట పడుతుందని ఆయన విమర్శలు గుప్పించారు. వైసీపీలోకి మంచి వాళ్లనే చేర్చుకుంటామని, గంటాలా బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేవారికి వైసీపీ తలుపులెప్పుడూ మూసే ఉంటాయని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -